ఈ ఏకే 47 ఖరీదు రూ. 3 కోట్లు

ఈ ఏకే 47 ఖరీదు రూ. 3 కోట్లు

ముషీరాబాద్, వెలుగు: సదర్ సమ్మేళనంలో హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్న రాజా (ఏకే47) సెంటర్ ఆఫ్​అట్రాక్షన్​గా నిలిచింది. దీని ధర దాదాపు రూ. 3 కోట్లకు పైగానే ఉంటుందని యజమాని తెలిపారు. హర్యానా నుంచి దీన్ని స్పెషల్​ వాహనంలో ముగ్గురు పనివాళ్లు, మేనేజర్​తో కలిసి తీసుకురావడానికి 4 రోజులు పట్టింది. ఇందుకు రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇది తినే తిండి దగ్గరి నుంచి ప్రతీది మేనేజర్​తోపాటు ముగ్గురు ట్రైనర్లు మానిటర్​ చేస్తారని చెప్పారు. రోజూ ఖాజు, బాదం పిస్తాతో పాటు యాపిల్స్, ఇతర ఫ్రూట్స్​పెడతారు. ఒక్కరోజు తిండి ఖర్చే రూ. 28 వేలు ఉంటుందని కేర్​టేకర్​ తెలిపారు. రోజూ స్పెషల్​ఎక్సర్​ సైజ్​లు, మసాజ్ చేయిస్తామన్నారు. దీని కోసం పనిచేసే వాళ్లకు నెలకు రూ.లక్ష పైనే జీతాలు ఇస్తామని చెప్పారు.  దీంతో ఈ దున్న ముందు సెల్ఫీలు దిగేందుకు జనాలు పోటీ పడ్డారు.  ఏకే 47తో పాటు తెలంగాణకు చెందిన పదుల సంఖ్యలో దున్నలను యాదవుల సదర్ ​సమ్మేళనానికి తీసుకువచ్చారు.